Friday, May 10, 2024
- Advertisement -

దివ్యాంగులు కోసం అయోధ్యలో కొత్త కట్టడం..!

- Advertisement -

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని దర్శించుకునేందుకు రోప్​వేను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం స్విట్జర్లాండ్​కు చెందిన ఓ సంస్థతో మున్సిపల్ అధికారులు చర్చలు జరుపుతున్నారని చెప్పారు.

ఆలయ ప్రాంగణంలో ఒక పాయింట్ ఏర్పాటు చేసి భక్తులకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో మరో పాయింట్​ను ఏర్పాటు చేయనున్నట్లు అయోధ్య మున్సిపల్ కమిషనర్ విశాల్ సింగ్ తెలిపారు.మందిర నిర్మాణానికి చలువరాళ్ల(మార్బుల్)ను ఆలయ పరిసరాల్లోకి తీసుకెళ్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడు క్రేన్లు, పది ట్రక్కులు, 50 మంది కార్మికులు ఈ పనిలో నిమగ్నమైనట్లు స్పష్టం చేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -