2004 నాటి ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో అరెస్టు అయిన ముగ్గురు పోలీసు అధికారులు జీఎల్ సింఘాల్, తరుణ్ బరోత్, అనజు చౌదరికి ఊరట లభించింది. ఈ కేసు నుంచి వారికి విముక్తి కల్పిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న చివరి నిందితులు అయిన ముగ్గురు పోలీసులు.. అవసరమైన అనుమతి మంజూరు కావడంతో విచారణను విరమించుకోవాలని కోరుతూ మార్చి 20 న కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు.
గుజరాత్ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీని హత్యచేయడానికి ఇష్రత్ జహాన్తో పాటు జావేద్ షేక్ అలియాస్ ప్రణేశ్ పిల్లై, అంజద్ అలీ అక్బరలీ రానా, జోషన్ జోహార్ అనే ఉగ్రవాదులు కుట్రపన్నారని ఆరోపిస్తూ వారిని 2004 జూన్లో పోలీసులు అహ్మదాబాద్లో ఎన్కౌంటర్ చేశారు.
ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపణలు రాగా… ఈ వ్యవహారం మొత్తం తీవ్ర వివాదాస్ప దమైంది.తాజాగా తమను విడుదల చేయాలంటూ ముగ్గురు పోలీసు అధికారులు (వీరిలో బరోత్ రిటైర్ అయ్యారు) డిశ్ఛార్జి పిటిషన్ వేయగా సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి వీఆర్ రావల్ అనుమతించారు.
టోర్నీ వాయిదా.. క్రీడా అభిమానులకి చేదు వార్త..!