కంబళ వీరుడు.. అభినవ ఉసేన్ బోల్ట్ మళ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇదివరకు తాను రాసిన రికార్డులనే మళ్లీ తిరగరాశాడు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయనే కంబళ వీరుడు శ్రీనివాస గౌడ. వివరాల్లోకెళ్తే.. కర్నాటక కు చెందిన కంబళవీరుడు శ్రీనివాస గౌడ భారత్ పరుగు సునామీ, అభినవ ఉసెన్ బోల్ట్ గా పెరుగాంచాడు.
రాష్ట్రంలో గతంలో నిర్వహించిన కంబాళ పోటీలలో 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పరుగును పూర్తి చేసి దేశ ప్రజల దృష్టిన తన వైపు తిప్పుకున్నాడు. అప్పటి నుంచి శ్రీనివాస గౌడను కంబళ వీరుడు, అభినవ ఉసెన్ బోల్ట్ అని ముద్దుగా పిలుస్తున్నారు. తాజాగా ఇదివరకు తన పేరుపై ఉన్న రికార్డును తానే తిరగరాశాడు. ఆదివారం జరిగిన పోటీల్లో 125 మీటర్ల పరుగును కేవలం 11.21 సెకండ్లలో పూర్తి చే శాడు.
దీనిని 100 మీటర్లకు లెక్కగట్టగా 8.78 సెకన్లలోనే పరును పూర్తి చేసినట్టు అని నిర్వాహకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ నెలలో నిర్వహించిన మరో పోటీల్లో 100 మీటర్ల దూరాన్ని 8.96 సెకండ్లలో పరుగును పూర్తి చే శాడు ఈ కంబళ వీరుడు. దీంతో శ్రీనివాస గౌడకు సర్వత్ర అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కంబళ క్రీడలు అనేవి వ్యవసాయ క్రీడ. దీనిని కర్నాటకలో పలు చోట్ల ఘనంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఇది బురదలో దున్నపోతులతో పరుగులు పెట్టించే ఓ వ్యవసాయ క్రీడ.
మణిశర్మ బీటూ.. చిరు స్టెప్పూ !
మళ్లీ లాక్డౌన్ అవసరముండదు: ఏపీ హోం మంత్రి