దేశంలో కరోనా వైరస్ విజృంభణ మళ్లీ మొదలైంది. గత కొన్ని రోజులుగా నిత్యం ఇరవై వేల మందికి పైగా కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ తీవ్ర స్థాయిలో పంజా విసురుతోంది. దేశంలో నమోదవుతన్న కొత్త కేసుల్లో ఎక్కవగా ఇక్కడే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ను కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇటీవలే పలువురు నటీనటులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ యంగ్ హీరోయిన్ తార సుతారియాకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, మరో నటుడు సిద్ధాంత్ చతుర్వేది కూడా కరోనా బారిన పడ్డారు. ‘తపడ్’ చిత్ర ప్రమోషన్లో తార పాల్గొనాల్సి ఉంది. ఇక కత్రినా కైఫ్, ఇషాన్ కట్టర్ తారాగణంగా తెరకెక్కుతున్న ‘ఫోన్ బూత్స సినిమా షూటింగ్ లో సిద్ధాంత్ చతుర్వేది పాల్గొనాల్సి ఉంది. వీరిద్దరికి కరోనా సోకిందని నిర్థారణ కావడంతో వారిద్దరూ తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్ లో గడుపుతున్నారు.
కాగా, ఇటీవలే బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణబీర్ కపూర్ కూడా కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ కు చెందిన మనోజ్ బాజ్పేయ్, సంజయ్ లీలా భన్సాలీ, ఆశీష్ విద్యార్థిలకు కరోనా సోకింది. ఇలా వరుసగా నటీనటులు కరోనా బారినపడుతుండటంతో సినీ వర్గాలు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
పసుపు పాలతో ప్రయోజనాలెన్నో !