రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల ప్రజాధనం ప్రైవేటు వ్యక్తుల పాలవుతోందని.. రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఆ దుర్వినియోగాన్ని ఆపాలని కేంద్ర మంత్రి జావడేకర్ను కోరారు.
రాష్ట్రంలో మరిన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరముందని, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి తాము సహకరిస్తామని బండి సంజయ్ కేంద్రమంత్రికి స్పష్టం చేశారు.డీపీఆర్లు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించకపోవడం, కేంద్ర జలశక్తిశాఖ అనుమతి లేకుండానే ప్రాజెక్టులు ప్రారంభించడం వెనుక అవినీతి దాగుందని బండి సంజయ్ ఆరోపించారు.
ఈ విధంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కావడమే కాకుండా…ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యక్తుల పాలవుతోందని కేంద్ర మంత్రికి వివరించారు. నిబంధనల్లో తేవాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో చర్చించి… నిర్ణయం తీసుకుంటానని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు.
నేను సీఎం మనిషిని..రూ.50 వేలు పంపు..!
మోదీకి కలిసి సూచనలు ఇచ్చాను: ఎంపీ రఘురామకృష్ణరాజు..!
మేయర్ విజయలక్ష్మికి ఫ్లెక్సీ షాక్..!
ఘట్కేసర్ అత్యాచారం కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్!