హాస్యనటుడు విజయ్సాయి ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన విజయ్ భార్య వనితా రెడ్డి ఈ రోజు సెల్ఫీ వీడియోలో మాట్లాడిన విషయం తెలిసిందే. తన భర్త ఇతర యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుపుతూ ఆయనకు సంబంధించిన రెండు ఫొటోలను మీడియాకువిడుదల చేసింది. అందులో విజయ్ ఇతర అమ్మాయిలతో జల్సా చేస్తోన్న ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
విజయ్ సాయి చేసిన అరాచకాలను బహిర్గతం చేసేందుకు సాక్ష్యాలను రాబట్టే పనిలో ఉన్నానని, త్వరలోనే పోలీసులకు లొంగిపోతా అంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది వనితా రెడ్డి. నేను తప్పుచేయలేదు. నా బిడ్డ భవిష్యత్ కోసమే ఇలా పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతన్నానని ఈ విషయంలో పోలీసులు క్షమించాలన్నారు. తనపై వస్తున్న ఆరోపణలనుండి పూర్తిగా బయటపడతానని, తన వల్లే విజయ్ సాయి చనిపోయాడనేది పూర్తిగా అవాస్తవం అన్నారు. విజయ్సాయిని డబ్బుకోసం బ్లాక్ మేయిల్ చేయలేదని తెలిపింది.
అయితే వనితారెడ్డి విడుదల చేసిన ఫోటోలపై విజయ్ సాయి తండ్రి స్పందించారు. ఆ ఫొటోలలో తన కుమారుడితో ఉన్న ఆ అమ్మాయి ఎవరో బయటకు రావాలని ఆయన అన్నారు. వనితా ఈ ఫొటోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తోందని తెలిపారు. ఇవే ఫొటోలను కోర్టులోనూ ఇచ్చిందని అన్నారు. వనితారెడ్డి చేసే ఆరోపణల్లో నిజం లేదని, కోర్టులో ఇచ్చిన ఫొటోలనే మళ్లీ ఈ రోజు పంపిందని చెప్పారు. మీడియాను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
ఈ రెండు ఫొటోలేకాక విజయ్కు ఇతర యువతులతో సంబంధాలున్నట్లు తెలిపే మరిన్ని ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తన దగ్గర ఉన్నాయని ఆమె తెలిపింది. విజయ్ విశ్వరూపం అందరికీ తెలియాలని ఈ ఫొటోలు పంపుతున్నానని చెప్పింది. తన దగ్గర ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని, అవి తన వద్దకు త్వరలోనే వస్తాయని పేర్కొంది.