ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి దాకా మాతోనే ఉన్న పవన్ ఇప్పుడు విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. పవన్ను టీడీపీ ఎన్నడూ విమర్శించలేదని …ఎదుటి వారే మాపై బురుదజల్లుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తాను ఎవరిపైనా విమర్శలు చేయలేదని… కేవలం సమస్యలపైనే పోరాడానని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజాపాపై నిప్పులు చెరిగారు.
కేంద్ర ప్రభుత్వం మనల్ని ఎన్ని విధాల ఆడించాలో అన్ని విధాలా ఆడిస్తోందని మండిపడ్డారు. ఏపీ పట్ల వివక్ష చూపుతోందని అన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేసిందని… ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీకి తెలుగువారు బుద్ధి చెప్పారని… తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనని చెప్పారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తోందని విమర్శించారు.