Tuesday, May 14, 2024
- Advertisement -

నంద్యాల‌లో అధికార పార్టీకి చేదు అనుభ‌వాలు

- Advertisement -

ఏపీ ఐటీశాఖ మంత్రి లోకేష్ తెలివితేట‌లు గురించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సి ప‌నిలేదు.మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టినుంచి అనేక సార్లు ఆనాలోచితంగా మాట్లాడి ప్ర‌జ‌ల‌ల్లో చుల‌క‌న‌య్యారు.టీడీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌జాప్ర‌తినిధికి ప్ర‌జ‌ల‌నుంచి ఎదురైన చేదు అనుభ‌వాలు చాలా త‌క్కువ‌.కాని మ‌న చిన‌బాబు మాత్రం ప‌ర్య‌టించిన ప్ర‌తీ సారి వ్య‌తిరేక‌త ఎదుర్కొన్నారు.

వారంరోజుల క్రితం నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో రెండు రోజుల‌పాటు ప‌ర్య‌టించారు.అనేక ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.అయితే అనేక చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి.ఎన్నిక‌ల ప్ర‌చారంలో నంద్యాల ప్ర‌జ‌లు త‌మ‌కు ఏంచేశారో చెప్పాల‌ని ముఖంమీద‌నే నిల‌దీశారు.దీంతో ఖంగు తిన్నారు చిన‌బాబు.

ప్ర‌జ‌లు ప్ర‌శ్నించిన‌ప్పుడు వారిని ఎలా స‌ముదాయించాలో …ఎలా మాట్లాడోలో తెలియ‌క‌పోవ‌డం చూస్తె ఆయ‌న అస‌మ‌ర్థ‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.నంద్యాల ప్ర‌చారంలో ప‌లు మార్లు ప‌రువు పోగొట్టుకున్న లోకేష్ మ‌రిన్ని రోజులు ఇక్క‌డే ఉండి ప్రాచారం చేస్తే బాగుంటుంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.మ‌రో సారి ప్ర‌చారానికి తీసుకురావాల‌ని టీడీపీ న‌తేల‌కు విజ్ణ‌ప్తి చేస్తున్నారు ప్ర‌తిప‌క్ష పార్టీనేత‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -