తరచుగా వార్తల్లో నిలిచే బీజేపీ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని ప్రజలు ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వానికి మరోసారి ఓటు వేయాలని అన్నాడు. లేకపోతే అక్కడి ప్రజలను బుల్డోజర్లతో తొక్కిస్తామని హెచ్చిరించారు.
ఉత్తర ప్రదేశ్ లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో రాజాసింగ్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రజలు ఆరాష్ట్రంలో ఉండాలంటే యోగికి ఓటు వేయాలని అన్నారు. ఈ సారి యోగికి ఓటు వేయకపోతే రాష్ట్రం విడిచిపెట్టి పోవాలని అన్నారు.
లే కపోతే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు, జేసీబీలు తెచ్చి సిద్ధంగా ఉంచారని పరోక్షంగా హె చ్చరించారు. యూపీలోని హిందువులు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని యోగిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. రాజాసింగ్ను జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు.