Saturday, May 4, 2024
- Advertisement -

కర్ణాటకలో సీఎం మార్పు మళ్లీ తెరమీదకు .. క్లారిటీ ఇచ్చినా ఆగని ఊహాగానాలు

- Advertisement -

‘కర్ణాటకలో సీఎం మార్పు ఉండదు. ముఖ్యమంత్రి యడియూరప్ప ఎంతో సమర్థంగా పాలన కొనసాగిస్తున్నారు. ఆయన పూర్తికాలం పదవిలో ఉంటారు’ అంటూ బీజేపీ హైకమాండ్​ ఇప్పటికే పలు మార్లు క్లారిటీ ఇచ్చేసినా.. కర్ణాటకలో సీఎం మార్పు అంశం మళ్లీ మళ్లీ తెరమీదకు వస్తూనే ఉంది. కర్ణాటకలో సీఎం ను మార్చబోతున్నారంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్​ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నది. అయినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు.

బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లద్‌ .. ఇటీవల ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మరో రెండేళ్లు తానే సీఎంగా ఉంటానంటూ యడియూరప్ప ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే కర్ణాటకలో రాజకీయాలు మారాయి. ఆయన వైరి వర్గం సమావేశాలు నిర్వహిస్తూ.. ఢిల్లీకి ప్రదక్షిణలు చేస్తున్నది.

Also Read: యూపీ సీఎం యోగిని మార్చేస్తారా? నిజమెంత?

ఇప్పటికే పలుమార్లు కర్ణాటకలోని ఓ వర్గం యడియూరప్పపై ఫిర్యాదులు చేసింది. ఆయన కుమారుడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. అరవింద్​ బెల్లద్​ ఢిల్లీ పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది. అయితే తన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని ఆయన ప్రకటించారు.

Also Read: బెంగాల్​లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ.. సొంత గూటికి ముకుల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -