Thursday, May 16, 2024
- Advertisement -

ఫిరాయింపు నేత‌ల గుండెల్లో బాంబు పేల్సిన బాబు ర‌హ‌స్య స‌ర్వే

- Advertisement -

మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో అన్ని పార్టీలు స‌ర్వేలు ప్రారంభించాయి. ఇప్ప‌టికే అనేక స‌ర్వేల‌ల్లో వైసీపీ విజ‌యం సాధిస్తుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. తాజాగా బాబు చేసిన ర‌హ‌స్య స‌ర్వే బ‌య‌ట‌కు రావ‌డంతో ఫిరాయింపు నేత‌ల గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి.

వచ్చే రెండు నెలల కాలాన్నీ అత్యంత కీలకంగా భావిస్తున్న చంద్రబాబు, తాను చేయించిన సర్వేలో ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని తేలడంతో ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు తదితర జిల్లాల్లోని ఆరేడుగురు ఎమ్మెల్యేలు మరోసారి గెలిచే పరిస్థితి లేదని ఈ సర్వే తేల్చినట్టుగా సమాచారం.

చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ప్రజలు, సీఎంగా చంద్రబాబుపై మాత్రం తమకు నమ్మకం ఉందని చెప్పడంతో, ఆయా నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిని సారించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మ‌రో వైపు ఫిరాయింపు నేతలు నియోజ‌క వ‌ర్గాల్లో ప‌ట్టిప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు సమాచారం. వారికి టికెట్లు ఇచ్చేది లేదన్న సంకేతాలు పంపిన బాబు త్వ‌ర‌లో వారి నియోజ‌క వ‌ర్గాల్లో భారీ మార్పులు చేయ‌నున్నారు.

ఇంటింటికీ వంట గ్యాస్ పైప్ లైన్లు, రేషన్ కార్డులు, సొంత ఇళ్లు, రోహదారుల మెరగు వంటి అంశాలపై సమస్యలు ఎక్కడ ఉన్నా, వాటిని జనవరిలోగా పరిష్కరించాలని చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయంట‌. సొంత‌పార్టీని మోసం చేసి టీడీపీలో చేరిన నేత‌ల‌కు ఇప్పుడు ఏంచేయాలో తెలియ‌క దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నారు. మ‌రి వారి భ‌విష్య‌త్తు ఏంట‌నేది త్వ‌ర‌లో తేల‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -