కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుంటుంబానికి ప్రత్యేకత ఉంది. భూమా బ్రతికున్నప్పుడు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిన భూమా కుటుంబం ఆయన మరణం తర్వాత వారి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. నాగిరెడ్డి మరణించిన తర్వాత రాజకీయాలు ఒక్క సారిగా మారిపోయాయి. అఖిల మంత్రి పదవిని చేపట్టినప్పటినుంచి వ్యతిరేక వర్గం తయారయ్యింది.
ఇదంతా అఖిల చేసుకున్న స్వయం కృతాపరాధమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి చేపట్టిన తర్వాత జిల్లాలోని సీనియర్ నాయకులను లేక్కచేకపోవడం, ఒంటెద్దు పోకడలు అవలంభించడంతో మిత్రులుగా ఉన్న వారంతా శత్రువులా తయారయ్యారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే వచ్చే ఎన్నికల్లో భూమా కుటుంబం పోటీ చేసే పరిస్థితులు కనిపించడంలేదు.
ఆళ్లగడ్డనుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న భూమా అఖిల ప్రియకు చుక్కలు చూపిస్తున్నారు ఏవీ సుబ్బారెడ్డి. అఖిలకు వ్యతిరేకంగా తన వర్గాన్ని పటిష్టం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విబేధాలు తారాస్థాయిలో ఉన్నాయి. పనిలో పనిగా 2019 ఎన్నికల్లో ఆళ్లడ్డనుంచి నేనే పోటీ చేస్తానని సుబ్బారెడ్డి ప్రకటించడంతో అఖిల రాకీయ భవిస్యత్తే ప్రమాదంలో పడింది.
ఇదలా ఉంటే నంద్యాల టీడీపీలో రాజకీయ రచ్చ మొదలయ్యింది. ఇప్పుడు నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డికి చెక్ పెట్టేందుకు ఎస్పీవై రెడ్డి కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భూమా కుటుంబంమీద ఒత్తిడి పెంచడంలో సఫలం అయ్యారనే చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్తో పాటు.. నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి కూడా తన కుటుంబసభ్యులే పోటీ చేస్తారని ఎంపీ ఎస్పీ వైరెడ్డి ప్రకటించారు.
నంద్యాల స్థానం నుంచి ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారనే తెలుస్తోంది. ఇప్పటి వరకు తెరవెనుక రాజకీయం నడిపామని ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు సజ్జల శ్రీధర్ రెడ్డి తెలిపారు. అధిష్టానం కూడా వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆళ్లగడ్డలో ఏవీ, నంద్యాలలో ఎస్పీ వైరెడ్డి ప్రకటనలతో భూమా వర్గం ఆందోళనలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేస్తారా లేక వేరే పార్టీలోకి జంప్ అవుతారో చూడాలి.