Thursday, May 23, 2024
- Advertisement -

ప్రాణ‌భ‌యం ఉందంటూ బాబు చెప్ప‌డం సిగ్గుచేటు… కాంగ్రెస్ నేత సి. ర‌మ‌చంద్ర‌య్య‌

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడిపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్‌నేత‌, మాజీమంత్రి సి.రామ‌చంద్ర‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన సీఎం నాకు ప్రాణ‌భ‌యం ఉందంటూ చెప్ప‌డం సిగ్గుచేట‌న్నారు. రాష్ట్రాన్ని కాపాడే ముఖ్యమంత్రే ఇలా భయపడుతుంటే..ఇక ప్రజలను ఎలా కాపాడతారని ప్రశ్నించారు.

అసలు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని, బాబు చేసిన అక్రమాలు అరాచకాలే ఆయనకు ముప్పును తెస్తాయని విమర్శించారు. నాకు ఏదైనా జ‌రిగితే ప్ర‌జ‌లు ర‌క్ష‌ణ వ‌ల‌యంగా ఉండాల‌ని బాబు చేస్తున్న వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల సానుభూతి కోసంలా ఉన్నాయ‌న్నారు. చంద్రబాబుకు ప్రజలు తమ ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేయడమే పాపమని అన్నారు.

కేంద్రానికి బాబు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు…? దేని గురించి భయపడుతున్నారు? ఎందుకు, ఆవిధంగా మాట్లాడుతున్నారు? ప్రజలు ఏవిధంగా మిమ్మల్ని కాపాడగలుగుతారు? అంటూ ప్రశ్నించారు. ‘అంత సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఆవిధంగా మాట్లాడుతున్నారంటే..కేవలం, ప్రజల నుంచి సానుభూతి సంపాదించుకునేందుకేనా లేక ఏమైనా నిజముందా? ఇది సానుభూతి కోసమో, రాజకీయ ఎత్తుగడో చెప్పాల్సిన అవసరం నీకు (చంద్రబాబు)కు ఉంది! చంద్రబాబు నాయుడు గారేన‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -