Wednesday, May 22, 2024
- Advertisement -

మహిళా ఎంపీ పై సీరియస్ అయిన జగన్

- Advertisement -

వైసీపీ అధినేత జగన్.. వైసీపీకి చేందిన మహిళా ఎంపీ తీరుపై ఆగ్రహించినట్లు సమాచారం. తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ సంబంధించిన సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశానికి.. మహిళా ఎంపీ బుట్టా రేణుక హాజరు కాలేదట. బుట్టా రేణుక తాజాగా ఏపీ మంత్రి.. టీడీపీ నేత లోకేష్ ను కలిసారట. ఈ క్రమంలో తాజాగా జరిగిన వైసీపీ పార్టీ సమావేశానికి ఆమె రాకపోవడంతో జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహించినట్లు తెలుస్తోంది. పార్టీలు ఎంపీలు సరిగ్గా నడుచుకోవడం లేదని మండిపడినట్లు సమాచారం. ప్రజలను పక్కన పెట్టి తమ వ్యాపారాలకే పెద్ద పీటను వేస్తున్నారని జగన్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. అయితే బుట్టా రేణుక సమావేశానికి రాకపోవడానికి కారణం.. ఆమె లోకేష్ ను కలవడంతో పాటు.. పలువురు ఇతర ఎంపీల తీరు పైన సీరియస్ గా ఉన్న ఆయన ఆ కోపంతో సమావేశాన్ని కేవలం 30 నిమిషాల్లోనే కంప్లీట్ చేశారని తెలుస్తోంది. మొన్నటి ప్లీనరీ తర్వాత పార్టీకి మంచి ఊపు వస్తుండటంతో ఈ మధ్య బాగా హూషారుగా ఉంటున్న జగన్.. తాజాగా జరిగిన సమావేశంలో మాత్రం సీరియస్ గా ఉన్నారని పలువురు ఎంపీలు అంటున్నారు. అలానే ఎంపీల పనితురు కూడా బాలేదని అన్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉంటే ఖచ్చితంగా కొన్ని నియమనిబంధనలను పాటించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుందని జగన్ అన్నట్లు తెలుస్తోంది. జనంతో మమైకం కావాలని.. తమ సొంత వ్యాపారలకు దూరంగా పెట్టాలని.. ఎంపీలపై పైర్ అయ్యాడట. పార్టి రోజు రోజుకి బలపడుతున్న సమయంలో ఎంపీలు ఇలా చేయడం పై జగన్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -