Friday, April 26, 2024
- Advertisement -

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా పాజిటీవ్!

- Advertisement -

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. నిన్న కొత్త‌గా 2,17,353 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 1,185  మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,74,308కు పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. కరోనా మహమ్మారికి రాజకీయ నేతలు, సినీ, క్రీడా రంగానికి చెందిన వారు విల విలలాడిపోతున్నారు.

తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యింది. జ్వరం తీవ్రంగా ఉండడంతో శుక్రవారం బెంగళూరులోని రామయ్య మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. మళ్లీ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది.

ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం ఆయన కొవిడ్ పై అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తన నివాసంలో అధికారులతో సమీక్ష చేశారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

పవన్ కళ్యాన్ కి కరోనా పాజిటీవ్…

తెలంగాణ లో మళ్ళీ లాక్ డౌన్ చర్చ.. చివరికి ఏమైంది అంటే..!

కోలీవుడ్ కమెడియన్ కి సీరియస్.. ఐసీయూలో చికిత్స!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -