పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలకమైన నందిగ్రామ్ స్థానంలో ముఖ్యమంత్రి, టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సమయంలో ఆమె నందిగ్రాంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 8,000 ఓట్ల వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, అనంతరం రౌండ్లలో మాత్రం ఆమె అనూహ్యంగా పుంజుకున్నారు. ఆరు రౌండ్ల ఓట్ల తర్వాత ఆమె 1,427 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు.. 61 వేల ఆధిక్యంలో వైసీపీ
తొలి ఐదు రౌండ్ల పాటు ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి.. ఒక్కసారిగా వెనుకంజలోకి వెళ్లిపోవడం గమనార్హం. ఐదో రౌండ్లోనే సువేందు ఆధిక్యం 9 వేల ఓట్ల నుంచి 3 వేలకు పడిపోయింది. రాష్ట్రంలో ఏకంగా 201 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి.
అస్సాంలో దూసుకెళ్తున్న బీజేపీ..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 147 స్థానాల్లో గెలవాల్సి ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో కొనసాగుతోన్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ, బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు.