Sunday, April 28, 2024
- Advertisement -

మాట నిల‌బెట్ట‌కుంటుందా అఖిలా…..?

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక నేప‌ధ్యంలో మంత్రి అఖిల‌ప్రియ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉప ఎన్నిను ప్రీతీష్టాత్మ‌కంగా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చంద్ర‌బాబు త‌న క్యాడ‌ర్ అంతా నంద్యాల‌లోనె మోహ‌రించారు. అఖిల వ్యాఖ్య‌లు ఇప్పుడు నంద్యాల రాజ‌కీయాల‌నే కుదిపేస్తున్నాయి.
ఉప ఎన్నిక‌లో స‌ర్వేల‌న్నీ కూడా వైసీపీ వైపే మొగ్గు చూడంతో టీడీపీకి ఏంచేయాలో పాలు పోవ‌డంలేదు. ఇప్ప‌టికే నంద్యాల‌లో ప్ర‌జ‌ల‌కు తాయిలాలు ప్ర‌క‌టించ‌డంతోపాటు..అధికార దుర్వినియోగానికి కూడా పాల్ప‌డుతున్నారు. అయినా కూడా ఉప‌యేగం లేక‌పోవ‌డంతో చివిర సార‌గిగా సెంటీమెంట్ అస్త్రం ప్ర‌యేగించారు అఖ‌ల‌ప్రియ‌.
నంద్యాల ఉపఎన్నికల్లో ఓటమిపాలైతే రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. పలు విషయాలపై స్పందించిన శిల్పా మోహన్ రెడ్డి తన తండ్రి మరణించారన్న వార్త ప్రకటించకముందే పక్కగదిలో వారసుడెవరని మాట్లాడారని అన్నారు. ఆయన పదవి కోసమే పార్టీ మారారని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, వారికి అంతా తెలుసని ఆమె చెప్పారు.
ఎన్నికల్లో పాల్గొవడం తొలి సారి కనుకే తనకు సహచర మంత్రులు సహాయం చేస్తున్నారని ఆమె అన్నారు. తనకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉందని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చే ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు.
గ‌త కొన్ని రోజులుగా అఖిల కుటుంబంలో బేదాభిప్రాయాలు ఉన్నాయ‌నే వార్త‌లుపై కూడా స్పందించారు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టే తన మామ సుబ్బారెడ్డితో అభిప్రాయబేధాలు ఉన్నాయని తెలిపారు. అయితే అవి తమ బంధాన్ని విఛ్చిన్నం చేసేంత, మీడియా చూపేంత స్థాయిలో లేవని ఆమె చెప్పారు. నంద్యాల ఉపఎన్నికల్లో విజయం తమదేనని ఆమె స్పష్టం చేశారు.

https://www.youtube.com/watch?v=pzXC0MfaL94

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -