Saturday, May 4, 2024
- Advertisement -

కోనసీమలో ఎమ్మెల్సీ కవిత…

- Advertisement -

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత ఏపీలో ప్రత్యక్షమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలంలోని ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత..ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు.బ్రిటీష్ హాయాంలో కూడా ముంగండ గ్రామ ప్రజలు ఎంతో ధైర్యం ప్రదర్శించి ఆలయాలను కాపాడుకున్నారని కొనియాడారు. అమ్మవారి దయతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

తనకు ముత్యాలమ్మ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించినందుకు ముంగండ గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక కవిత రాకతో సందడి వాతావరణం నెలకొనగా గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలోనూ సీఎం హోదాలో కేసీఆర్ ఏపీలోని ఆలయాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. విజయవాడ కనకదుర్గమ్మతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -