రాజ్యసభలో సోమవారం ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ ప్రతిపక్ష నేతపై ప్రధానమంత్రి ప్రశంసల జల్లు కురింపించాడు. వివరాల్లోకి వెళితే.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మోదీ ప్రసంగించారు. ఒక సందర్భంలో మోదీ మాట్లాడుతూ.. రాజ్యసభ ప్రతిపక్షనేత గులాంనబీ అజాద్(కాంగ్రెస్) పై ప్రశంసల వర్షం కురిపించారు.
విపక్షంలో ఉన్నప్పటికీ ఆయన ఎంతో హుందాగా మాట్లాడుతారని, ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నట్లు మోదీ వ్యాఖ్యానించారు. సభలో కొత్తగా అడుగుపెట్టేవారు అజాద్ నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. అంతేకాకుండా ఇటీవల జమ్మూకశ్మీర్లో జరిగిన స్థానిక ఎన్నికలను సైతం మోదీ ప్రస్తావించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో గులాంనబీ అజాద్ ఎంతో చొరవ చూపారని ప్రశంసించారు. మోదీ ప్రసంగంతో అధికార పక్షంతో పాటు విపక్ష సభ్యులు సైతం అశ్చర్యానికి గురయ్యారు.
ఇక గులాంనబీ అజాద్ విషయానికి వస్తే.. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడే గొప్ప రాజకీయ నాయకుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కీలక విషయాల్లో ప్రభుత్వానికి పలు సూచనలు ఇస్తారు. సొంత పార్టీ నాయకత్వంపై పలుమార్లు అసమ్మతి గళం వినిపించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీపై తిరుగుబాటు లేఖ సందించిన సీనియర్లలో గులాంనబీ అజాద్ ఒకరు. పార్టీలో సమూల మార్పులు జరగాలని గత ఏడాది ఆగస్టులో లేఖ రాసి, అసమ్మతిని బహిర్గతం చేసిన జీ–23లోని కీలక నేతల్లో ఆయన కూడా ముఖ్య పాత్ర పోషించారు.
ఆ జీవో బాబే తెచ్చారు.. వల్లభనేని వంశీ ఫైర్!
నేనెంటో చూపిస్తానంటున్న బాలయ్య