టీడీపీలో నాయకులు వారసుల గోల మొదలయ్యింది. సీనియర్నేతలు రాజకీయాలనుంచి తప్పుకొని తమ వారసులను రంగంలోకి దింపేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మాజీ మంత్రలు తన వారలసులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వారసుల రాజకీయాలకోసం అవసరం అయితే పార్టీలు మారేందుకు సిద్దంగా ఉన్నారు.
మాజీ మంత్రులు గాలిముద్దుకృష్ణమనాయుడు, బొజ్జలగోపాలకృష్ణారెడ్డిల వ్యవహారంపై ఇప్పుడు టీడీపీలో పెద్ద చర్చే జరుగుతోంది. వీరి పుత్రరత్నాలిద్దరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇద్దరూ కూడబలుక్కునే వైసిపి నేతలతో టచ్ లో ఉన్నారన్న విషయంపై టిడిపిలో చర్చనీయాంశంగా మారింది.
దీనికి ప్రధానం కారనం ఇద్దరు నేతల వయసు దృష్ట్యా నగరి, శ్రీకాలహస్తిలో టికెట్లు ఇచ్చేది లేదని ఇప్పటికే చంద్రబాబు ఖరాకండీగా చెప్పారు. దీంతో తమ నియోజకవర్గాల్లో తమ పిల్లలకు టిక్కెట్లు ఇవ్వమని చంద్రబాబును అడిగారు. అయితే, ఆ విషయంలో కూడా చంద్రబాబు నుండి స్పష్టమైన హామీ దక్కలేదట. దాంతో ఏమి చేయాలో వారికి అర్థం కాలేదు.
ముందు జాగ్రత్తగా ఎందుకైనా మంచిదని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. అందుకనే వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు. ఒకవేళ తమ పిల్లలకు టిడిపిలో పోటీ చేసే అవకాశం రాకపోతే వెంటనే వైసిపిలో చేరి టిక్కెట్లు తెచ్చుకోవాలన్నది మాజీ మంత్రుల ఆలోచనగా టిడిపిలో చర్చ జరుగుతోంది. అయితే, ఇన్ని సంవత్సరాలుగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న నేతలను కాదని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రుల కొడుకులు బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భాను ప్రసాద్ లకు టిక్కెట్లు ఇస్తారా అన్నది అనుమానమే.
నగిరి నియోజకవర్గం సమస్యల పరిష్కారంపై ఎంఎల్ఏ రోజా బాగానే పోరాటం చేస్తున్నారు. ఇంటా, బయట కూడా రోజాకు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. అంటువంటి రోజాను కాదని ముద్దు కృష్ణమనాయుడు కొడుకు భానుప్రసాద్ కు జగన్ టిక్కెట్టిచ్చేది అనుమానమే. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కడ టిక్కెట్లు వస్తుందో ఇపుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి.