ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నాన్ని టీడీపీ నాయకులు రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్పై దాడి ఆరోపనల పేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేల బాబుకు పార్టీ సీనియర్ నేత షాక్ ఇచ్చారు.జగన్పై జరిగిన హత్యాయత్న ఘటనపై బాబు వ్యవహిరస్తున్న తీరుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్సెల్ ఉపాధ్యక్షుడు మేడపాటి రామారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరుతో పార్టీ పట్ల పెంచుకున్న నమ్మకం నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఆయన తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో టీడీపీలో పనిచేస్తున్నానని రామారెడ్డి చెప్పారు. మానవత్వం ఉన్న ఎవ్వరైనా జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించాల్సిందేనన్నారు. ఎవరికైనా కష్టం వస్తే శత్రువునైనా పలుకరించి అధైర్యపడవద్దని భరోసా ఇవ్వడం కనీస ధర్మమని.. ఇందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు విచక్షణ కోల్పోయి చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో మనో వేదనకు గురిచేశాయన్నారు.పార్టీ అధినేతే అలా వ్యవహరిస్తుంటే కిందిస్థాయిలోని మంత్రులు కూడా ఆయనను అనుసరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో ఇమడలేక రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.