Saturday, April 20, 2024
- Advertisement -

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసిపి అభ్యర్థులు వీరే..!

- Advertisement -

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసిపి అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అనారోగ్యంతో కన్నుమూసిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కుమారుడు బల్లి కల్యాణ్ చక్రవర్తికి, ఎ‌మ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా భగీరథరెడ్డికి వైసిపి అవకాశం కల్పించింది.

ఇక కడప జిల్లాకు చెందిన సి. రామచంద్రయ్య, శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన ఇక్బాల్‌ను మరోసారి మండలికి పంపాలని వైకాపా నిర్ణయించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయవాడకు చెందిన కరీమున్నిసా పేరు ఖరారు చేశారు.

ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీలకు పోటీ చేయట్లేదని సజ్జల స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలకే అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు.

వామ్మో.. వైష్ణవ్ తేజ్ అప్పుడే రేటు పెంచాడే!

బిగ్ బాస్ 5 సీజన్ ఎప్పుడో తెలుసా?

పుష్ప కోసం బన్నీ ఏం చేస్తున్నాడో తెలుసా..?

హీరో నితిన్ ‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -