Friday, March 29, 2024
- Advertisement -

అప్పుడు జగన్ కి పొగిడారు.. ఇప్పుడు ఆయనకి పోటీగా నిలిచారు..!

- Advertisement -

నెల్లూరులో సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక బిజెపీ-జనసేన అభ్యర్థి రత్నప్రభ తెలిపారు. తిరుపతి భాజపా కార్యాలయంలో రత్నప్రభ మీడియా సమావేశంలో మాట్లాడారు.

తిరుపతి కోసమే కాకుండా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. జనసేన మద్దతు భాజపాకు లేదన్న ప్రచారం సరికాదన్న రత్నప్రభ.. తన అభ్యర్థిత్వంపై 200 శాతం పవన్ సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. పిలిస్తే ప్రచారానికి వస్తానని పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారని వివరించారు.

గతంలో జగన్‌ను ప్రశంసించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రత్నప్రభ వ్యాఖ్యానించారు. మంచి పని చేస్తే ప్రశంసించా.. అంతమాత్రాన మద్దతు ఇస్తానని కాదని స్పష్టం చేశారు. డబ్బుకు ఓటెయ్యాలో లేదా నీతి నిజాయతీకి ఓటెయ్యాలో ప్రజలు తేల్చుకోవాలని పేర్కొన్నారు.

బోటు ఆపండి బాబో.. పరిగెత్తిన కీర్తి సురేష్!

వైసీపీలో మరో విషాదం.. బద్వేల్ ఎమ్మెల్యే కన్నుమూత!

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -