- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 53,476 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… నిన్న 26,490 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,87,534కు చేరింది. నమ్మినా నమ్మకున్నా, నచ్చినా నచ్చకున్నా కోవిడ్ సెకండ్ వేవ్ ఒక నిజం ఇప్పుడు. కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్ కన్నా స్పీడ్ ఉంది పెరుగుదలలో… కానీ కేసుల త్రీవ్రత తక్కువుగా ఉంది.
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- మాస్కూని మించిన రక్షణ లేదు
- సమూహాలకు దూరంగా ఉండండి
- అంత్యక్రియలు వంటి కార్యక్రమాలలో బాగా జాగ్రత్తగా ఉండండి
- ఏసీ హాల్స్ వంటి వాటిలో వైరస్ వ్యాప్తి ఎక్కువ
- బయట ఆహారానికి దూరంగా ఉండండి
- రోజు గంట ఎండలో వ్యాయామం
- సీ విటమిన్ ఆహార పదార్థాల స్వీకరణ
- ఆరోగ్యకరమైన నిద్ర
- వ్యక్తిగత పరిశుభ్రత
- పాజిటివ్ ఆలోచనలు
కోవిడ్ మునుపటి కన్నా ప్రమాదకరంగా మారింది అన్న వార్తలు నమ్మకండి. వ్యాప్తివేగం పెరిగింది కానీ ప్రమాద స్థాయి పెరగలేదు. డాక్టర్స్ కు, ప్రజలకు అవగాహన పెరిగింది.
ఆరోగ్యానికి ఐదు రకాల జ్యూసులు !