సన్రైజర్స్ ఆటగాడు మనీష్ పాండే స్ట్రైక్రేటుపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. నిన్నటి మ్యాచ్లో మరింత బాగా రాణించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2021 నేపథ్యంలో కోలకతా నైట్రైడర్్సతో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. బెయిర్స్టో (55), మనీష్ పాండే (61 నాటౌట్) అర్ధసెంచరీలు వ`థా అయిపోయాయి.
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మనీష్ పాండే ఆట తీరు గురించి మాట్లాడుతూ.. తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేయడం మంచి విషయం. అతడితో పాటు జట్టులోనూ ఆత్మవిశ్వాసం నింపుతుంది. కానీ జట్టులోని ముఖ్య ఆటగాడు కాబట్టి మరింత బాగా రాణించాల్సి ఉంటుంది. బెయిర్స్టోతో మనీస్ భాగస్వామ్యం గొప్పగానే ఉంది కానీ, చివరి బంతి వరకు స్ట్రైక్రేటు మెయింటెన్ చేయకపోవడం నిరాశపరిచింది.
ఏదేమైనా మొదటి మ్యాచ్లో సెలక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు అని చెప్పాడు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన కోలకతా 187 పరుగుల లక్ష్యాన్ని విధించగా, సన్రైజర్్స నిర్నీత 20 ఓవర్లలో కేవలం 177 పరుగులే చేయగలిగింది. దీంతో సీజన్ మొదటి మ్యాచ్లో ఓటమి తప్పలేదు. ఇక హైదరాబాద్ తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 14న చెపాక్ స్టేడియంలో ఆర్సీబీతో ఆడనుంది.
నాగబాబు వర్సెస్ పేర్ని నాని ట్విట్స్ యుద్దం!
మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరడా !