- Advertisement -
భారత్ ను అవాకులు, చవాకులు పేలే పాక్ ఆటగాళ్లకు ఇండిన్ క్రికెటర్ గబ్బర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.భారత్ విషయంలో పాక్ క్రికెటర్లు పదే పదే సూచనలు చేయడంతో ధావన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాక్ క్రికెటర్లు భారత్ అంతర్గత విషయాల్లో సలహాలు ఇవ్వడం మానేసి… వారి సొంత దేశంలో సమస్యల సంగతి చూసుకుంటే సరిపోతుందని హితవు పలికారు.
ఇతర దేశస్థుల సలహాలు మనకు అవసరం లేదని….ముందు వాళ్ల సమస్యలను పరిస్కరించుకోవాలన్నారు.అద్దాల భవనంలో ఉండేవారు ఇతరుల మీదకు రాళ్లేయకూడదు.’ అని ధావన్ అన్నాడు. గతంలో కశ్మీర్ అంశంపై పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన ట్వీట్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.