Monday, May 6, 2024
- Advertisement -

మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచ‌రీ…చిత్తుగా ఓడిన భార‌త్‌

- Advertisement -

ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచ‌రీ సాధించి త‌మ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన రెండో టి-20లో భార‌త్‌పై ఆసీస్ 7 వికెట్లతో గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కోహ్లీ మ‌రోసారి త‌న బ్యాట్‌కు ప‌ని చెప్పాడు. కేవ‌లం 38 బంతుల్లో 72 పరుగులు సాధించి, జ‌ట్టుకు భారీ స్కోరును అందించాడు. కేఎల్‌ రాహుల్‌ ( 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ధోని (40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశారు. అనంతరం 192 భారీ

స్కోరును చేధించేందుకు బ్యాంటిగ్‌కు దిగింది ఆసీస్‌. ఓ పెనర్‌ స్టొయినిస్‌ (7),కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ (8) త‌క్కువ స్కోరుకే అవుట్ అయిన లాభం లేక‌పోయింది.మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌ (113 నాటౌట్‌) అజేయ సెంచరీతో త‌మ జ‌ట్ట‌కు విజ‌యం సాధించి పెట్టాడు. ఈ మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు ఆసీస్ బ్యాట్స్‌మెన్ల ముందు తెలిపోయారు. దీంతో రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో ఆసీస్ విజ‌యం సాధించింది.

https://www.youtube.com/watch?v=b2GCjN5i9wA

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -