Friday, May 10, 2024
- Advertisement -

స‌ఫారీ గ‌డ్డ‌పై ధావ‌న్ మ‌రో కొత్త రికార్డ్‌..

- Advertisement -

సఫారీ గడ్డపై భారత్ తన దూకుడు కొనసాగిస్తోంది. నాలుగో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా దక్షిణాఫ్రికా బౌలర్లను ఆటాడుకుంటోంది. వైఫల్యాల బాట కొనసాగిస్తూ ఓపెనర్ రోహిత్ శర్మ (5) మరోసారి తక్కువ స్కోర్‌కే ఔటైనా.. సారథి కోహ్లీ, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకొని సెంచరీ దిశగా కదంతొక్కారు.

జోహన్నెస్‌బర్గ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. తొలి 100 మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇప్పటివరకూ రెండో స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (4217 పరుగులు)ను అధిగమించాడు. తొలి స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా (4808 పరుగులు) ఉన్నాడు.

భారత్ తరఫున తొలి వంద మ్యాచ్‌లతో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ కోహ్లీ పేరున ఉండగా.. ధావన్ తన 99వ మ్యాచ్‌లోనే దాన్ని అధిగమించాడు. భారత సారథి విరాట్ కోహ్లీ తొలి వంద మ్యాచ్‌లలో 48.89 సగటుతో 4107 పరుగులు చేయగా.. శిఖర్ 99 వన్డేల్లోనే 45.54 సగటుతో 4200 పరుగులు పూర్తి చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -