- Advertisement -
కరోనా విరామం తర్వాత తిరిగి తుపాకీ పట్టి.. లక్ష్యాన్ని గురి చూసేందుకు భారత పిస్టల్, రైఫిల్ షూటర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం దేశ రాజధానిలో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ ఛాంపియన్ షిప్ ఆరంభం కానుంది. మహమ్మారి కాలంలో ఎక్కువ సంఖ్యలో దేశాలు పాల్గొంటున్న తొలి టోర్నీ ఇదే.
వైరస్ విరామం తర్వాత పిస్టల్, రైఫిల్ విభాగంలో ఇదే మొదటి ప్రపంచకప్. గత నెలలో ఈజిప్టులో స్కీట్, ట్రాప్ విభాగాల్లో పోటీలు జరిగాయి. సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీ కోసం భారత్ 57 మంది షూటర్లతో బరిలో దిగనుంది.
ఇప్పటికే ఒలింపిక్స్ కోటా స్థానాలు సంపాదించిన 15 మంది షూటర్లూ వాళ్లలో ఉన్నారు. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్కు సన్నాహకంగా వాళ్లకు ఈ టోర్నీ ఉపయోగపడనుంది.
బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటుడు అరుణ్ గోవిల్!