భారత్- న్యూజిలాండ్ మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందె. ఇప్పటికె 2-1 తేడాతో సిరీస్ను కోల్పోయిన న్యాజిలాండ్ టీ20 సిరీస్ను గెలిచేందుకు కసరత్తులు చేస్తోంది. మరో వైపు భారత్ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. టీ20 సిరిస్కు న్యాజిలాండ్ జట్టులోఒక మార్పు చేసింది.
గాయం కారణంగా లెగ్ స్పిన్నర్ టాడ్ అస్లే భారత్తో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో రాస్ టేలర్ను జట్టులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్ ప్రధాన కోచ్ మైక్ హెసన్ వెల్లడించారు. ‘టేలర్ టీ20 మ్యాచ్లు ఆడి చాలా కాలమైంది.
2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిన తర్వాత అతడు దేశం తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో ఒక మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం రాస్ మంచి ఫామ్లో ఉన్నాడు. మిడిలార్డర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అస్లే దూరం కావడం చాలా బాధగా ఉంది.’ అని మైక్ తెలిపాడు.