ముంబై ఇండియన్స్ జట్టు కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జెర్సీ వేసుకుని ఆ జట్టుని ఛీర్ చేస్తున్న ఒక మహిళను మీరు టీవీ లో చూసే ఉంటారు. చాలామందికి తను ఎవరు అనే అనుమానం వచ్చి ఉండొచ్చు.
తన పేరు నవనీత గౌతమ్. నవనీత గౌతమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మసాజ్ థెరపిస్ట్ గా చేస్తున్నారు. నవనీత గౌతమ్ గురించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రకటించినప్పుడు కొద్దిరోజుల వరకు నవనీత గౌతమ్ హెడ్ లైన్స్ లో ఉన్నారు. దానికి కారణం ఐపిఎల్ ఫ్రాంచైజీ లో ఫిమేల్ స్టాఫ్ తక్కువగా ఉండడమే.
నవనీత గౌతమ్ కెనడాకి చెందిన వారట. నవనీత ఒక అథ్లెటిక్ థెరపిస్ట్ అట. అంటే స్పోర్ట్స్ ఆడే వారిని (అథ్లెట్స్) ఎలా ట్రీట్ చేయాలి అనే దాని పై ఇది ఒక స్పెషలైజేషన్. నవనీత తల్లిదండ్రుల కి క్రికెట్ అంటే చాలా ఇష్టమట. నవనీత ఇంత దూరం ఇండియాకి ప్రయాణించడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదట.కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తో కలిసి పని చేస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందట. నవనీత గౌతమ్ అంతకుముందు FIBA ఏషియా కప్ కి, అలాగే గ్లోబల్ టి20 కెనడా లీగ్ లో టొరంటో నేషనల్స్ తో కూడా పనిచేశారట.
ధోనీకి చివర్లో అంతగా ఇబ్బంది ఎందుకు పడ్డాడో తెలుసా ?
అత్యాచారం చేసి నాలుక తెగ్గోసి..తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది..?