టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇటీవలే “అల వైకుంఠపురములో” సినిమాతో నాన్ ‘బాహుబలి’ రికార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. లగ్జరీ కార్లను అద్దెకిస్తున్న ఓ కంపెనీలో అల్లు అర్జున్ 7 శాతం వాటాలను కొనుగోలు చేశాడని తెలుస్తోంది.
ఇదే సంస్థలో ఇప్పటికే ఓ ప్రముఖ రాజకీయ నేత కూడా భాగస్వామిగా ఉండగా, ఆయన సలహాతోనే బన్నీ, ఈ వ్యాపారంలోకి అడుగులు వేశాడని తెలుస్తోంది. ప్రముఖుల ఇళ్లలో శుభకార్యాలు జరిగే వేళ, వచ్చే సెలబ్రిటీల ప్రయాణానికి ఈ సంస్థ ఖరీదైన కార్లను సరఫరా చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ సినిమా థియేటర్లు, పబ్ ల వ్యాపారంలో ఉన్న బన్నీ, తనకు పెద్దగా పరిచయం లేని కార్ల అద్దె బిజినెస్ లోకి దిగడంపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా అల్లు అర్జున్ నుంచి ప్రకటన రాలేదు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.