రూ.50 కోట్లు ఇస్తే ప్రధాని మోదీని చంపేస్తాననంటూ ఓ బీఎస్ఎఫ్ జవాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీకి ప్రయత్నించిన బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్ ఎవరైనా నాకు 50 కోట్ల రూపాయలు ఇస్తే ప్రధాని నరేంద్ర మోదీని చంపుతానంటూ బహదూర్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.
ఎస్పీ తరఫున వారణాసిలో తేజ్ బహదూర్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పలు తప్పిదాల కారణంగా ఎన్నికల సంఘం తిరస్కరించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల కిందటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.ఈ వీడియోలో ఉన్నది తానేనని తేజ్ బహదూర్ ఒప్పుకున్నారు. అయితే, ఈ వీడియో వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
జాతీయ చానెళ్లలో ప్రసారమైన ఈ వీడియోలో తేజ్ బహదూర్ ఓ స్నేహితుడితో మాట్లాడుతూ.. రూ. 50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానని చెప్పాడు. అందుకు పాకిస్థాన్ ఇస్తుందని స్నేహితుడు బదులివ్వగా.. తాను దేశభక్తుడినని, పాక్ సాయం తీసుకోబోనని, భారతీయుడు డబ్బు ఇస్తే.. ఈ పని చేస్తానని అతను చెప్పుకొచ్చినట్టు ఈ వీడియోలో సంభాషణ ఉంది. ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ కావడంతో బీజేపీ నేతలంతా ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియోపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ వీడియోపై భాజాపా ఎంపీ జీవీఎల్ స్పందించారు.ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి రూ. 50 కోట్లతో ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేయడం షాకింగ్ ఉందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు .