సాదారనంగా మహిళలు బిడ్డలకు జన్మనిస్తారు.ఇది సృష్టి ధర్మం.కాని అధునిక టెక్నాలజీ పుణ్యమాని వైద్యరంగం కొత్తుంతలు తొక్కుతోంది.మగ వాల్లుకూడా పిల్లలకు జన్మనివ్వడం ఒకింత ఆశ్చర్యమే.లింగ మార్పిడి చేయించుకుని ఒ యువకుడు పండంటి పాపకు జన్మనిచ్చిన ఘటన వైరల్గా మారింది.
వివిరాల్లోకి వెల్తే బ్రిటన్కు చెందిన 21ఏళ్ల హేడెన్ క్రాస్ పండంటి పాపకు జన్మనిచ్చాడు. లింగమార్పిడి చేయించుకున్న తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన తొలి పురుషుడిగా హేడెన్ రికార్డు సృష్టించినట్లు కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. పుట్టుకతోనే స్త్రీ అయిన హేడెన్ లింగమార్పిడి చేయించుకుని పురుషుడిలా మారాడు.
మూడేళ్ల నుంచి ఆమె అతడిలా మారి జీవిస్తున్నాడు. పురుషుడిగా మారేందుకు హార్మోన్ల మార్పిడి చికిత్స చేయించుకున్నాడు. దాంతో భవిష్యత్తులో బిడ్డలను కనలేడని ముందుగానే బిడ్డను కనాలని నిర్ణయించుకున్నాడు. దాంతో వీర్యం దానం చేసేందుకు ఎవరైనా సహాయం చేయాల్సిందిగా ఫేస్బుక్లో కోరాడు. ఓ దాత ముందుకు వచ్చి వీర్యం దానం చేయడంతో హేడెన్ గర్భం దాల్చాడు.
ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించిందిజూన్ 16న గ్లోసెస్టేర్ రాయల్ ఆసుపత్రిలో హేడెన్ బిడ్డకు జన్మనిచ్చాడు. ఆ పాపకు పైగే అని పేరు కూడా పెట్టుకున్నాడు. తండ్రిని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది అని హేడెన్ తెగ సంతోష పడిపోతున్నాడు. పురుషుడిగా మారిన తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన తొలి వ్యక్తి ఇతనే అనేందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు.కాగా ఈ ఉదంతపై బ్రిటన్ లో దుమారం చెలరేగుతోంది.
Also read