ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఆసిస్ ఆటగాళ్లను కవ్వింపులకు గురిచేశాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజా (28: 125 బంతుల్లో 1×4) బ్యాటింగ్ చేస్తుండగా..రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలు స్టంపింగ్ మైక్లో రికార్డయ్యాయి.
తొలి ఓవర్లోనే అరోన్ ఫించ్ (0) డకౌటవగా.. అనంతరం వచ్చిన ఉస్మాన్ ఖవాజా క్రీజులో కుదురుకునేలోపే మరో ఓపెనర్ హారిస్ (26), షాన్ మార్ష్ (2) ఔటైపోయారు. వికెట్ల పతనానికి ఇక అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్న ఉస్మాన్ ఖవాజా.. భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. క్రీజులో పాతుకుపోయాడు. ఎంతలా అంటే.. అతను ఆడిన 125 బంతుల్లో సగానికిపైగా డిఫెన్స్తోనే సరిపెట్టేశాడు.
పుజారా తరహాలో.. ఉస్మాన్ ఖవాజా కూడా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన రిషబ్ పంత్.. వికెట్ల వెనుక నుంచి.. ‘అందరూ ఇక్కడ పుజారాలు కాలేరు’ అని కవ్వించాడు. దీనికి ఉస్మాన్ ఖవాజా స్పందించలేదు. కానీ.. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను అశ్విన్ బౌలింగ్లో రిషబ్ పంత్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.