అమెరికా క్యాపిటల్ భవనంలో జరిగిన ఘర్షణను అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ ఖండించారు. ప్రజాస్వామ్యం అసాధారణ దాడికి గురైందన్నారు. టీవీ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు సమావేశమైన కాంగ్రెస్కు వ్యతిరేకంగా వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టారు. బారికేడ్లు తోసుకుంటు లోపలికి చొచ్చుకేళ్లారు. నిరసనకారుల కన్నా పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల పరిస్థితి చెయ్యిదాటిపోయింది. ఈ పరిణామాలు కాల్పులకు దారితీశాయి. ఫలితంగా ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా క్యాపిటల్ భవనంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హింసకు ప్రేరేపించారని మండిపడ్డారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఇది అమెరికాకే మచ్చ అని పేర్కొన్నారు.
జర్మనీ ఛాన్సలర్కి మోదీ కరోనా పాఠాలు..!
మదన్ కౌశిక్ డుమ్మా.. ఇప్పుడు కొత్త సందేహాలు..!