ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ధైర్యాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. తమ గోడును అధిష్టానం దష్టికి తీసుకువెళ్లిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మారతాయని కేడర్ బలంగా నమ్మింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ... రాజకీయంగా తమకు లబ్ది చేకూరుతుందని ఆశపడింది. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా ఇంతవరకూ కార్యకర్తలను పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. దీంతో కొంతమంది బాహాటంగానే తమ అసంత
ప్తని వెళ్లగక్కుతున్నారు. ఈ విషయాన్నే డిప్యూటీ సీఎం ధర్మాన ఏకంగా.. ఎంపీ విజయసాయిరెడ్డి ముందు ప్రస్తావించారు.
శ్రీకాకుళంలో వైఎస్సార్ సీపీ కార్యాలయ ప్రారంభోత్సం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని కుండబద్దలు కొట్టారు. ఇక ఇందుకు సానుకూలంగా స్పందించిన విజయసాయిరెడ్డి .. కార్యకర్తలకు ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆరు నెలల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జాబ్మేళాను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నిజానికి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు పార్టీ కార్యవర్గం సమావేశమైన దాఖలాలు కనబడటం లేదు. ఈ అభిప్రాయం చాలా మంది పార్టీ నేతల్లో ఉంది. ముఖ్యంగా జిల్లా స్థాయి నాయకులందరిలో అసంతృప్తి గూడు కట్టుకుని ఉన్న విషయం పలు సందర్భాల్లో స్పష్టమవుతూనే ఉంది. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు కూడా అంగీకరిస్తారు. అయినప్పటికీ వారి తీరులో మాత్రం మార్పు కనిపించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం గ్రామ వాలంటీర్లను నమ్ముకుని , తమను గాలికి వదిలేశారని, కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంక్షేమ పథకాలు చేపట్టడం మంచి విషయమేనని, అయితే తమను పట్టించుకోకపోతే అసలుకే ఎసరు వస్తుందని కొంతమంది ఘాటు విమర్శలు చేస్తున్నారు.
బీజేపీ భారీ స్కెచ్.. త్వరలో కేసీఆర్కు భారీ షాక్?