గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం ఇంకా మరువనేలేదు. ఈ క్రమంలో పలు చోట్ల కోవిడ్ పేషెంట్లు చికిత్స ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంబవించి పలువరు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలోని భండారా జిల్లా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో పది మంది చిన్నారులు కన్నుమూశారు. భండారా జిల్లా ఆసుపత్రిలోని పిల్లలున్న కేర్ యూనిట్ (ఎస్ఎన్సియూ) లో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది 17 మంది పిల్లలుండగా వారిలో ఏడుగురిని రక్షించారు.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో డ్యూటీలో ఉన్న ఓ నర్సు గదిలో పొగ రావడం గుర్తించి వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో పదిమంది చిన్నారులు మృతి చెందడంపై అందరూ కన్నీరు పెట్టుకున్నారు.
నోరు పారేసుకున్న వార్న్.. మరీ ఇంత నీచమా!
తలొగ్గిన ట్రంప్.. అధికార బదిలీకి సహకారం..!