టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇటీవల పూజా నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆలరించడం పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు ఆమె గ్లామర్ స్టామినా ఏంటో తెలియజేశాయి. ప్రస్తుతం ఈ బుట్ట బొమ్మ టాలీవుడ్లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ బిజీగా ఉంది. ఇక వరుస హిట్లు రావడంతో ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3 కోట్ల నుంచి నూ. 5 కోట్ల వరకు వసూలు చేస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో నయనతారతో పోటీ పడుతోంది.
ప్రస్తుతం ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ బుట్ట బొమ్మ తొలి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ భామ తొలిసారి జీవా హీరోగా నటించిన ‘మూగముడి’ సినిమాతొ హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా కోసం రూ. 30 లక్షల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. అలా తొలిసారి వచ్చిన సంపాదనతో పూజా హెగ్డే బీఎండబ్ల్యూ5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఆ కారు అంటే పూజాకు ప్రాణం అట. ఇప్పటికీ ఆ కారు తన ఇంట్లోనే దాచుకుందట.
ప్రస్తుతం ఈ బ్యూటీ.. ప్రభాస్తో రాధేశ్యామ్లో నటిస్తోంది. ఈ సినిమాను బాహుబలి సినిమా విడుదలైన ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు అఖిల్తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, సల్మాన్ ఖాన్ తో‘కభీ ఈద్ కభీ దీవాళీ’సినిమా చేస్తోంది.
పాపం ఈ అమ్మడి ఆశలన్నీ దానిపైనే..
వామ్మో.. నెలలో ప్రదీప్ ఇన్ని లక్షలు సంపాదిస్తాడా!