ఏదైనా నేరం జరిగినప్పుడు అందులో నిందితులను అరెస్ట్ చేయాల్సిందే. అందులోనూ ఓ వ్యక్తి మరణానికి కారణమైన వారు… ఎంతటి వారైనా అదుపులోకి తీసుకోవాల్సిందే. విచారణ చేసి నిజానిజాలు రాబట్టి… దోషులకు శిక్ష పడేలా చూసే బాధ్యత పోలీసులపై ఉంటుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మరణించిన ఓ వ్యక్తి విషయంలోనూ పోలీసులు తమ విధిని నిర్వర్తించారు. సదరు వ్యక్తి మృతికి ఓ కోడి కారణమని తేల్చిన పోలీసులు… హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు.
ఇటీవలే ప్రమాదవశాత్తు కోడి కత్తి మర్మాంగాలకు తగిలి ఓ వ్యక్తి మరణించిన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. లొత్తునూర్ శివారులో కోడి పందెం నిర్వహించడానికి స్థానికులు సిద్ధమయ్యారు. వెల్గటూరు మండలం కొండాపూర్కు చెందిన తనుగుల సతీశ్ (45) ఈ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా… కోడి కాలికి కత్తి కట్టేటప్పుడు అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ కత్తి… సతీశ్ పురుషాంగానికి, వృషణాలకు తగలగా అక్కడే కుప్పకూలాడు.
అక్కడున్న వారు వెంటనే స్పందించి క్షతగాత్రున్ని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా… మార్గ మధ్యలోనే సతీశ్ మృతి చెందాడు. సతీశ్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. సతీశ్ మరణించడానికి సదరు కోడి కారణమని తేల్చారు. కోడిని హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. పోలీస్స్టేషన్లోనే దాణా ఏర్పాటు చేసి జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !