రోడ్డు భద్రతపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు, వాహనచోదకులు చేస్తున్న తప్పులపై గతంలో ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్స్ వద్ద అవగాహన కల్పించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. అందరి వద్ద చరవాణి ఉండడం వల్ల దాని ద్వారానే… ట్రాఫిక్ నియమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
అందులో భాగంగానే.. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ లలో సైబరాబాద్ ట్రాఫిక్పోలీస్ ఖాతాలు తెరిచారు. మొదట్లో అంతగా ఆసక్తి కనబరచకపోయినా… సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా విజయ్ కుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వాటిలో చాలా మార్పులు చేసి ట్రెండ్కు తగ్గట్టుగా మీమ్స్ చేస్తూ ఆకర్షిస్తున్నారు.
నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సీసీటీవీ ఫుటేజ్లు… నిబంధనలు పాటించని వారి ఫోటోలతో ఆకట్టుకునేలా మీమ్స్ తయారుచేస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి మంచి స్పందన వస్తోంది. సినిమా, క్రికెట్, బిగ్బాస్ వంటి అంశాలపై మీమ్స్ ఉండటంతో నెటిజన్లు విపరీతంగా చూస్తున్నారు.
ఆకట్టుకుంటున్న జాతి రత్నాలు ట్రైలర్…!
అయ్యయ్యో.. బాలయ్యకు ఏంటీ ఈ కష్టాలు !
