దేశంలో కరోనా నానాటికీ విజృంభణ కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎంతవరకు పోరాడుతోందో అంతకన్నా ఎక్కువ ప్రజలు మనో నిర్భరంతో కరోనాపై యుద్దం చేయాలని అన్నారు ఏపి సీఎం జగన్. తాజాగా దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.
కరోనా ని సాగనంపాలంటే.. వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అన్నారు. అయితే, భారత్లో వ్యాక్సినేషన్ కోసం మొత్తం 172 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాల్సి ఉంటుందని చెప్పారు. ఏపీకి మొత్తం 7 కోట్ల డోసులు కావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటివరకు కేవలం 73 లక్షల డోసులను మాత్రమే ఇచ్చారని వివరించారు.
దేశ ప్రజలు కరోనాతో సహజీవనం చేస్తూనే, మరోపక్క దానితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించినప్పటికే ప్రతి ఒక్కరూ విధిగా కరోనా నియంత్రణ నియమాలు పాటించాలని అన్నారు.
అలా ఉండే భర్త కావాలంటున్న సురేఖా వాణి కూతురు..వైరల్!
స్నేహితుడితో కలిసి బీచ్కు వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం!