మిల్క్ బ్యూటీ తమన్నాకు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు దాటిన ఈమె అదే రేంజ్ లో ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు.ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు వెబ్ సిరీస్ లో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి తమన్నా మాట్లాడుతూ..
డిజిటల్ ప్లాట్ఫామ్స్ హవా పెరిగిన తర్వాత ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులు ఆస్వాదించే విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయని, అదేవిధంగా నటీనటుల స్టార్డమ్ విషయంలో కూడా ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారిందని మిల్క్ బ్యూటీ తమన్నా తెలిపారు. ఒకప్పుడు నటీనటులకు కేవలం ప్రతిభ ఉంటే చాలు ఫ్యాన్స్ అయిపోయే వారని, కానీ ప్రస్తుతం మాత్రం ప్రతిభతో పాటు వారు కోరుకునే కొత్తదనానికి తగ్గ పాత్రలు చేయడంతోనే ఎంతో మంది అభిమానులను పొందగలుగుతున్నారని తెలిపారు.
Also read:పుష్పకు అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్.. వింటే ఉగిపోవాల్సిందే?
తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఉన్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ఎంతో డిఫరెంట్ గా ఉందని,ఫ్యాన్బేస్ ఆర్గానిక్గా ఉండేది. ఏది ఏమైనా అప్పట్లో అభిమానులతో పాటు ఈ తరం ప్రేక్షకుల అభిమానాన్ని కూడా నేను పొందగలగడం నా లక్’’ అన్నారు. ప్రస్తుతం తమన్నా నటించిన “లెవెన్త్ అవర్”, ‘నవంబరు స్టోరీస్’ వెబ్ సిరీస్లు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా సినిమాల విషయానికొస్తే గోపీచంద్ సరసన సిటీ మార్, అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ త్రీ లో నటిస్తున్నారు.