మళయాళి కుట్టీ నజ్రియా నజీమ్ భారీగా రెమ్యూనరేషన్ పెంచేసింది. రాజారాణి మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ప్రస్తుతం అంటే సుందరానికి సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ మూవీలో నటనకు గాను నానీతో పాటు నజ్రియాకూ ఆడియన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. అయితే అంటే సుందరానికి మూవీకి నజ్రియా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందట. దాదాపు 2 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసి పోకుండా ఆమె రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళం, తమిళ చిత్రాల్లో నటించిన నజ్రియా …నటిగా కెరీర్ మొదలుపెట్టడానికి ముందు టీవీ షో యాంకర్గా పని చేసింది. 2014లో నటుడు ఫహద్ ఫాజిల్ను పెళ్లి చేసుకుంది.
Also Read
1.రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో ప్రభాస్ హీరోయిన్…!