హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై కామాంధుడి దాడి మరవక ముందే హైదరాబాద్లో మరో పైశాచిక ఘటన చోటుచేసుకుంది. రామాంతపూర్కి చెందిన 9 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం జరపడంతో ఆ చిన్నారికి తీవ్ర రక్త స్రావమైంది. రక్తస్రావంతో ఉన్న బాలికను ఆమె తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని మేస్త్రీ పనిచేసే లక్ష్మణ్గా గుర్తించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
వివరాల్లోకి వెల్తే….బాధితురాలి తల్లిదండ్రులు ఖమ్మం నుంచి నాలుగు నెలల క్రితం రామంతపూర్లోని టీవీ కాలనీకి వలస వచ్చి కూలీ పనిచేసుకుంటూ ఒక గుడిసెలో నివసిస్తున్నారు. గుడిసె ప్రక్కనే ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ మేస్ట్రీ పని చేసే లక్ష్మణ్(23), గుడిసెలో ఎవరు లేని సమయం చూసి బాలికపై అత్యాచారం చేశాడు. తీవ్ర రక్త స్రావంతో ఉన్న బాలికను గమనించిన స్థానికులు లక్ష్మణ్ను పట్టుకుని చితకబాదారు. అక్కడినుంచి లక్ష్మణ్ తప్పించుకున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. వరంగల్లో 9 నెలల పసిపాపపై హత్యాచారం ఘటన మరువక ముందే హైదరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.