ఫ్రాన్స్ లో జరగుతున్న జీ7 సదస్సులో భాగంగా ప్రధాన మోదీ, ట్రంప్ భేటీ అయ్యారు. జీ7 సదస్సులో భాగంగా ఇద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో కశ్మీర్ అంశం చర్చకు వచ్చింది. సదస్సుుక ముందు రెండు దేశాలు కోరితే.. మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన ట్రంప్.. మోడీతో భేటీ అనంతరం తన స్టాండ్ మార్చుకున్నాడు.కాశ్మీర్ అంశంలో పాక్..ఇండియాలు కలిసి కూర్చొని మాట్లాశ మన్నారు.
పాక్, భారత్ మధ్య ఉన్న సమస్యలన్నీ ద్వైపాక్షికమే అని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే ఈ అంశంలో ఇతర దేశాల జోక్యం గురించి పెద్దగా పట్టించుకోమని మోదీ అన్నారు. 1947 కన్నా ముందు భారత్, పాకిస్థాన్ దేశాలు కలిసే ఉన్నాయని ప్రధాని తెలిపారు.
భారత్ అభివృద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తామని ట్రంప్ చెప్పడం విశేషం. ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారత్ కు సహకరిస్తామని ట్రంప్ చెప్పారు.ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాశ్మీర్ సమస్యను కొలిక్కి తీసుకురావాలని అనుకున్నారు ఇమ్రాన్ ఖాన్ కు ఇది మింగుడుపడని విషయమే.