కర్ణాటకలో కావేరి జల వివాదాల ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో తమిళులు ఎక్కడ ఉన్న వారిని వెతికిమరి కర్ణాటక ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ తమిళనాడు బిజెపి నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు సౌందరరాజన్ మాట్లాడారు. కర్ణాటక- తమిళనాడు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కావేరి జలవివాదాన్నిపరిష్కరించడంలో సూపర్ స్టార్ రజిని కాంత్ మధ్య వర్తిత్వం వహించాలని ఆమె కోరారు. మొదట రజిని కాంత్ దీనికోసం కృషి చేయాలని అన్నారు. అప్పటికి సమస్య కొలిక్కి రక పొతే అప్పుడు ప్రధాని నరేంద్రమోడీ చూసుకుంటారని అన్నారు.
ఈ సందర్భంగా ఆమె కర్ణాటకలో తమిళుల పై దాడులను ఖండించారు. ఇలాంటి చర్యలను బిజెపి సహించబోదని అన్నారు. రాష్టాల్లో స్వార్థ రాజకీయాల వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి దీనిపై చర్చించుకునేంతవరకు ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకోరని అన్నారు.
Related