సాహో తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ సినిమా థియేటర్లలోకి రాలేదు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాక.. సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చే సబ్జెక్ట్ను ఎంచుకున్నాడు. అందులో భాగంగానే .. రాధేశ్యామ్ అనే ఓ పీరియాడికల్ డ్రామాలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.పీరియాడికల్, రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఆగిపోయింది. నిజానికి జూలై 30న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్తో ఆగిపోయింది.
మరోవైపు ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ , గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు పెండింగ్లో ఉండిపోయింది. షూటింగ్ పార్ట్ మాత్రం ఇప్పటికే పూర్తయ్యింది. అయితే ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో ఈ చిత్రం విడుదల వాయిదా పడుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ విడుదల మరింత లేట్ కావొచ్చట. మరోవైపు ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు విడుదల కావడం లేదు.థియేటర్ యాజమానులకు, సినీ నిర్మాతలకు మధ్య పంచాయితీ నడుస్తోంది. ఓటీటీ విషయంపై థియేటర్ యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ పరిస్థితుల్లో రాధేశ్యామ్ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే చాన్స్ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.
Also Read
రాధేశ్యామ్ రికార్డు.. ఏ ఇండియన్ సినిమాకు దక్కని ఘనత