జాతీయస్థాయిలో బిగ్ బాస్ చాలా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోని తెలుగులో అందించడం కోసం.. ఎన్టీఆర్ ను వ్యాఖ్యాతగా పెట్టి.. మాటీవీ వచ్చే నెలలో లాంఛ్ చేయబోతుంది. అయితే.. ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు.
{loadmodule mod_custom,GA1}
ఎన్టీఆర్ హోస్ట్ కాబట్టి.. నేనని,పోటీపడీ మరీ సెలబ్రిటీస్ వస్తారనుకుంటే ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దాంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్త మథన పడుతున్నాడట. అయితే ఎవరు రాకపోవడానికి కారణం.. బిగ్ బాస్ షోలోని టాస్క్ లేనట. మరి ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో..కాకపోతే పోసాని కృష్ణమురళి మాత్రం ముందుకు వచ్చారట. తాను ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది. కాకపోతే 2.5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడట. షోలో చేయాల్ంటే నెలలపాటు ఇంటికే పరిమితమవ్వాల్సినందున కొన్ని సినిమాలు వదులు కోవాల్సి వస్తుందని,2.5కోట్లు ఇస్తే చేయడానికి రెడీ అని చేప్పేసాడట. ఇక పోసాని ప్రతిపాదనలకు మా టీవీ యాజమాన్యం కూడా ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది.
{loadmodule mod_custom,GA2}
ఇంకోవైపు.. తేజస్వీ మదివాడ, మధుశాలినీలను కూడా సంప్రదించారట. అయితే వీరిద్దరికి.. చెరో 15 లక్షల రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఆఫర్ పై వారు ఎలా స్పందించారు అనేది తెలియాల్సి ఉంది. వచ్చే నెల నుండి ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
{youtube}ZY6fjPVlJrU{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related