Thursday, March 28, 2024
- Advertisement -

మహిళకు అవకాశమిద్దాం.. మా అధ్యక్షుడు నరేశ్​ ప్రతిపాదన

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో ‘మా’ ఎన్నికల హీట్​ కొనసాగుతోంది. మెగాస్టార్​ చిరంజీవి మద్దతుతో విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే తన ప్యానెల్​ను ప్రకటించారు. ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​లో మొత్తం చిరంజీవి అనుచరులే ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక మంచు విష్ణు, జీవిత, హేమ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. కానీ వారు ఇంకా ప్యానెల్​ను ప్రకటించలేదు. ప్రకాశ్​రాజ్ లోకల్​ కాదంటూ విమర్శలు వస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు నరేశ్​ మీడియాతో మాట్లాడారు. ’మా మసకబారిందని నిన్న నాగబాబు మాట్లాడారు. ఈ విషయం నన్ను ఎంతో బాధపెట్టింది. ఇక మహిళకు అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నాను. నేను కయ్యానికి కాలు దువ్వడానికి ఈ ప్రెస్​ మీట్​ ఏర్పాటు చేయలేదు. ప్రకాశ్​ రాజ్​ నాన్​ లోకల్​ అని నేను అనలేదు. నన్ను చాలా రోజుల క్రితమే ప్రకాశ్​రాజ్​ సంప్రదించాడు. మంచు విష్ణు కూడా సంప్రదించాడు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. అయితే అందరికీ అందుబాటులో ఉండేవారిని ఎన్నుకోవాలి. ప్రస్తుతం మాలో పదవులు అనుభవిస్తున్నవారే హఠాత్తుగా ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​ చేరడం చూసి నేను షాక్​ అయ్యాను’ అంటూ ఆయన పేర్కొన్నారు.

అనంతరం కరాటే కల్యాణి మాట్లాడుతూ.. ప్రకాశ్​రాజ్​పై విరుచుకుపడ్డారు. ‘ప్రకాశ్​రాజ్​కు స్త్రీలంటే గౌరవం లేదు. అటువంటి వ్యక్తికి మేము ఎందుకు సపోర్ట్​ చేయాలి’ అంటూ ఆమె విరుచుకుపడ్డారు. మొత్తానికి మా ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రకాశ్​రాజ్​ మాత్రం.. మీడియా అనవసరంగా ఈ వ్యవహారాన్ని హైలెట్​ చేస్తుందని .. ఇందులోకి రాజకీయాలను లాగుతున్నారని వాపోయారు.

Also Read

సూపర్ హీరో కాన్సెప్ట్ తో ‘హను -మాన్’ ప్రారంభం

బండ్ల గణేష్ స్పీచ్ మరోసారి వైరల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -